ప్రమాదాలు మరియు ఊహించని సంఘటనల నుండి రక్షణ కోసం ప్రజలు సాధారణంగా లైఫ్, హోమ్ మరియు వెహికల్ ఇన్సూరెన్స్లు తీసుకుంటారు. అయితే, హోమ్ ఇన్సురెన్స్ను మాత్రం భారతదేశంలోని చాలామంది గృహస్తులు అనవసరమైనదిగా భావిస్తుంటారు. అయితే, భూకంపాల నుండి కవర్ కోసం హోమ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి, ప్రత్యేకించి, ఈ ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ కవర్ చాలా అవసరం. భూకంపాలనేవి ఇంటి నిర్మాణం మీద ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఇల్లు/అపార్ట్మెంట్/ఫ్లాట్ లాంటివి పూర్తిగా నాశనం కావచ్చు..
భారతదేశం ప్రధానంగా భూకంపాలకు గురయ్యే దేశం. 2001లో, భుజ్ కేంద్రంగా సంభవించిన భూకంపం అనేది భారతదేశపు చరిత్రలోనే అత్యంత విధ్వంసకర భూకంపాల్లో ఒకటిగా నిలిచిపోవడమే కాకుండా, దీనికారణంగా పశ్చిమ భారతదేశంతో పాటు మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రదేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అలాంటి భూకంపం కారణంగా, ప్రాణ మరియు ఆస్తి నష్టాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. కాబట్టి, భూకంపాల నుండి రక్షణ కోసం తీసుకునే హోమ్ ఇన్సూరెన్స్ ఖర్చు అనేది ఇంటి పునర్నిర్మాణం కోసం అయ్యే ఖర్చు కంటే తప్పకుండా తక్కువే ఉంటుంది.
భారతదేశంలోని 4 భూకంప ప్రభావిత జోన్లనేవి ఆయా ప్రాంతాల్లో సంభవించగల భూకంపాల తరచుదనం మరియు తీవ్రత ఆధారంగా నిర్ణయించబడ్డాయి.
ఇంటి నిర్మాణం మరియు వస్తువులకు కవరేజీ
ఇంటి లోపలి విలువైన వస్తువులకు జరిగే నష్టానికి కవరేజీ
భూకంపం అనంతరం వచ్చే వరదల కారణంగా సంభవించే నష్టం కవర్ చేయబడదు
పాలసీ ప్రకారం, ఏవైనా వర్తించే మినహాయింపులు ఉంటే అవి మినహాయించబడతాయి
ఆదాయాలు నష్టపోవడం లేదా ఏదైనా పరోక్ష రకం నష్టం కవర్ చేయబడదు
ఆర్కిటెక్ట్లు, సర్వేయర్లు లేదా కన్సల్టింగ్ ఇంజనీర్ల ఫీజులు (3% క్లెయిమ్ మొత్తానికి మించినప్పుడు) కవర్ చేయబడవు
శిధిలాల తొలగింపును ఈ పాలసీ కవర్ చేయదు
అద్దె నష్టం కవర్ చేయబడదు
ప్రత్యామ్నాయ వసతి కోసం చెల్లించే అద్దె లాంటి అదనపు ఖర్చులు చేర్చబడవు
ఇన్సూరెన్స్ వ్యవధి ముగిసిన తర్వాత సంభవించే ఏవైనా నష్టాలు కవర్ చేయబడవు
టెక్టోనిక్ ప్లేట్లు లేదా భూమి లోపలి పొరల్లోని లోపాల కారణంగా ఆకస్మికంగా విడుదలయ్యే ఒత్తిడి కారణంగా ప్రధానంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. టెక్టోనిక్ ప్లేట్లు కదలిక కారణంగా ఈ ఒత్తిడి ఎక్కువవుతుంది మరియు భూకంపంగా పిలువబడే అకస్మిక కదలికల ద్వారా అది విడుదలవుతుంది. దేశంలోని ఈశాన్య ప్రాంతంతో పాటు హిమాలయాల పరిసర ప్రదేశాలు వ్యాప్తంగా 8.0 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రతి సంవత్సరానికి సుమారుగా 50 mm రేటుతో భారతదేశపు ప్లేట్ అనేది యురేషియన్ ప్లేట్ దిశగా కదలడం వల్లే ప్రధానంగా ఈ భూకంపాలు సంభవిస్తుంటాయి
ఈ భూకంపాల కారణంగా హిమాలయా ప్రాంతం మాత్రమే కాకుండా, భారత-గంగా మైదానాలు, భారత ద్వీపకల్పం వ్యాప్తంగా ప్రభావం ఉంటుంది. చారిత్రక నివేదికల ప్రకారం, భారతదేశంలోని 50% కంటే ఎక్కువ ప్రాంతం ప్రమాదకర భూకంపాల ప్రమాదం కలిగి ఉంది. రిక్టర్ స్కేల్ మీద 6.0 కంటే ఎక్కువ తీవ్రత నమోదైనప్పుడు అలాంటి భూకంపాన్ని తీవ్రమైనదిగా పరిగణిస్తారు. దీని కారణంగా, ప్రాణాలకు మరియు ఆస్తులకు భారీ నష్టం సంభవించవచ్చు.
1.5+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
#1.5+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్